Powered By Blogger

Sunday, June 24, 2012

SHAME - Do we really think before we STRATEGIZE?



మన మహా నేతధీ హత్యా లేక ప్రమాదమా

మనవరుకు ప్రమాదము అనుకున్న విజయమ్మ గారు కొత్తగా హత్యా అని మల్లి వార్త లేపారు, అసలు ఈ ఉదంతాన్ని ఇంకో వైపు నుంచి ఆలోచిస్తే మనకే గాక అందరికి జుగుప్స కలుగుతుంది.

సివిల్ అవియషణ్ డైరెక్టర్ H S ఖోల, మరియు మాజీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప అధినేత M R రెడ్డి గారి ద్విసభ్య కమిటి బెల్-430 ప్రమాదము వాతావరణం ములన జరిగిందే తప్ప, వేరే ఎ కారణాలు కనిపించలేదు అని తీర్మానించింది. పోనీ ఆ తీర్మానము, వాళ్ళ పనితీరు మిధ అనుమానాలు కలిగిన మనము ఇంకో కోణంలో అలోచిద్దాము. 

విజయమ్మ గారు, నిర్మోహమతముగా ప్రకటించారు, రాజశేఖర్ రెడ్డి గారి చివర రెండు రోజుల ప్రయాణానికి పాత హెలికాఫ్టర్ ని ఎందుకు వాడారు అని. ఆ సమయములో మన అవియషణ్ చీఫ్ గా పనిచేస్తుంది మన A1 గారితో పటు సెల్ లో కూర్చున్న బ్రహ్మానంద రెడ్డి గారే. మనకు ఒక్క సరి నడుస్తున్న కేసుని పరిశిలిస్తే తెలిక్క అర్ధం అవుతుంది A1 గారితో బ్రహ్మానంద రెడ్డి గారికి ఏమి సంబందము అనేది. మల్లి సాక్షి పెట్టుబడులు అంటూ ఆ చరిత్ర అంత చెప్పను. 

ఆ శాఖ లో పని చేసే అనుభవము లేని బ్రహ్మానంద రెడ్డి గారిని, తన వారు అయితే చాలు, అన్ని తనే అయ్యి చూసుకుని మహా నేత గారే అప్పాయింట్ చేసారు అనేది మనము తెలుసుకోవాల్సిన విషయము. ఎవరి అబ్యర్ధన మేరకు ఈ అప్పాయింట్మెంట్ అయ్యిందో చెప్పాల్సిన అవసరం లేదు.

మనము అర్ధం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఒక పత్రిక, ఛానల్ కల జగన్ బాబు, తన తండ్రిది హత్యా అని తెలిసి కూడా, ఢిల్లీ విధుల్లో ఓదార్పు యాత్ర అనుమతులు అని ఎందుకు తిరిగారు. అప్పటికి పదవి ఇస్తారు అనే ఆసతోనేనా. మరి అప్పుడు చెయ్యని అభియోగం మన విజయమ్మ గారు కొడుకుని జైలు లో పెట్టిన గంట లోనే ఎందుకు చెయ్యాల్సి వచ్చింది. 

అయిన MP పదవి కోసం సొంత బాబాయ్ నే రాజీనామా చెయ్యమని వత్తిడి తెచ్చిన జగన్ బాబు CM పదవి కోసం ఏమి చెయ్యగలడో ఆలోచించటం మనకు ఇబ్బంది, ఆ పదవి కోసం ఆరాటపడే వారి ఆలోచన తెలుసుకుంటే జుగుప్స కలగక మానవు.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.